సార్వత్రిక ఎన్నికల ఫలితాలు
ఎలా ఉండబోతున్నాయో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. విపక్షాలకి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా, వారి ఊహలకి అందని
తీరిలో ఫలితాలని వెల్లడించాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. కేంద్ర్రంలో మోడీ ప్రభంజనం కనిపిస్తుంటే, ఏపీలో
ఫ్యాన్స్ స్పీడుగా తిరుగుతోందని చెప్పేశాయి.కేంద్రంలో బీజేపీ గతంలో కంటే కూడా అధిక
సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు తేల్చాయి. మేజిక్
ఫిగర్ దాటి దాదాపు 15 స్థానాలను పైగానే ఎన్డీయే సాధిస్తుందని స్పష్టం చేశాయి.
ఇదిలాఉంటే యూపీఏ 126 స్థానాల లోపే విజయం సాధిస్తుందని తెలిపాయి. ఇతరులు హవా మాత్రం జెట్ స్పీడ్ లో ఉంది. 130 స్థానాలకి పైగానే ఇతరులు గెలుస్తారని జాతీయ మీడియా స్పష్టం చేసింది. అయితే తాజా సర్వేలు చూసిన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విపక్షాల్లో మాత్రం నైరాశ్యం నెలకొంది. మరి ఈ ఫలితాలు ఎంతమేరకు వాస్తవ ఫలితాలకు సమానంగా ఉంటాయనేది తెలియాలంటే మాత్రం 23 వరకూ వేచి చూడాల్సిందే.
SNO |
సర్వే సంస్థ |
ఎన్డీయే |
యూపీఏ |
ఇతరులు |
1 |
టైమ్స్ నౌ-వీఎంఆర్ |
306 |
132 |
104 |
2 |
రిపబ్లిక్ సీ ఓటర్స్ |
287 |
128 |
117 |
3 |
న్యూస్ ఎక్స్ నేత సర్వే |
298 |
118 |
127 |
4 |
ఎన్.డి.టీవీ |
298 |
128 |
116 |
5 |
రిపబ్లిక్ జన్ కీ బాత్ |
295-315 |
122-125 |
102-125 |
6 |
న్యూస్ నేషన్ |
282-290 |
118-126 |
130-138 |
7 |
సువర్ణ న్యూస్ 24/7 |
295-315 |
122-125 |
102-125 |
ఏపీలో ఫ్యాన్స్ స్పీడుకి బ్రేకులు లేవని, ఈ స్పీడులో టీడీపీ ఎన్నడూ లేనివిధంగా ఘోరమైన ఓటమిని చవిచూడనుందని తెలుస్తోంది. అంతేకాదు జనసేన పార్టీ సోది లోకి కూడా రాలేదు. కొన్ని జాతీయ సంస్థలు జనసేన గూర్చి ప్రస్తావించక పోవడం గమనార్హం. దాదాపు ఇప్పటి వరకూ తమ సర్వేల రిజల్స్ బయటపెట్టిన అన్ని సంస్థలు జగన్ కే పట్టం కట్టడం ఒకెత్తయితే. చంద్రబాబు కి ఆది నుంచీ అండగా ఉంటూ వచ్చిన లగడపాటి తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా తప్పుడు లేక్కలనే వెల్లడించారని రాజకీయ పండితులు అంటున్నారు.