ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే అధికారం అంటున్నారు ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి రాజగోపాల్.. అయితే అదంతా నిజమేనా.. నిజంగా టీడీపీ మళ్లీ గెలుస్తుందా.. అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. తెలుగుదేశం నేతలే ఈ సర్వే పట్ల అంత నమ్మకంగా లేరు. 


మరి లగడపాటి ఎందుకు ఇలాంటి సర్వేలు ప్రకటిస్తున్నారు. దీనికి సమాధానం వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి చెబుతున్నారు. 40 వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లగడపాటి దివాలా తీశాడు. దీన్ని ఆసరా చేసుకుని పగలు కిరసనాయిలు ( తోక పత్రిక ),  బాబుకు, రాత్రి బుకీలతో డీల్స్ కుదిరించాడు. తెలంగాణా ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఇలాగే బోగస్ సర్వే ఇచ్చి వెయ్యి కోట్లు సంపాదించారు.. అంటున్నారు విజయసాయిరెడ్డి.


మళ్లీ సేమ్ డ్రామా... బుకీలు యాక్టివ్ అయిపోతారు. అమాయకులను నమ్మించి సైకిల్‌పై పెట్ట్టిస్తారు. తన పేపర్లో ఎన్ని సీట్లలో గెలిచేది కిరసనాయిలు రాస్తాడు. సాయంత్రం 6 లోగా బుకీలు సేఫ్. చంద్రబాబు విదిల్చే కాంట్రాక్టులు, బుకీస్ ఇచ్చే కమిషన్లపై రోజులు వెళ్లదీస్తున్నాడు లగడపాటి.. అంటూ విరుచుకు పడ్డారు విజయసాయిరెడ్డి


 భీమవరం,విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్ ఆడేవారు 90 శాతం ఫ్యాన్ గెలుస్తుందని పెట్టారట. బుకీలు వేల కోట్లు నష్టపోయేట్టున్నారు. లగడపాటి - కిరసనాయిలు ఇద్దరూ కలిసి బాబు కోసం, బుకీల కోసం ఆడుతున్న డ్రామా. మొన్నటి ఎన్నికల్లో టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి లగడపాటి ఊగాడు.ఆ పార్టీ పరిస్థితి అర్థమై ఓడిపోయేదానికి ఎందుకులే అని తప్పుకున్నాడు.. అంటూ ట్విట్టర్లో రెచ్చిపోతున్నారు విజయసాయిరెడ్డి. 



మరింత సమాచారం తెలుసుకోండి: