ఏపీ మంత్రి నారా లోకేశ్ గెలుపు కోసం కుట్ర జరుగుతుందా..? మంగళగిరి ఫలితాలు తారు మారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా.. అంటే అవునంటున్నారు మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి..
మంగళగిరి ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తుందంటూ ఆయన సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. మంగళగిరి కౌంటింగ్లో టీడీపీ గొడవలు సృష్టించే అవకాశముందని సీఈవోకు ఆర్కే తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్నే చంద్రబాబు బెదిరిస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందిని కూడా భయపెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం తనయుడే అభ్యర్థి కావడంతో వివాదాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
ఫలితాలను తారుమారు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంత కౌంటింగ్కు పోలీసు సిబ్బందిని అదనంగా నియమించాలని సీఈసీని ఆర్కే కోరారు. మంగళగిరి కౌంటింగ్పై అదనపు అబ్జర్వర్ను నియమించాలని ఆర్కే డిమాండు చేశారు.