ఏపీలో జగన్ గెలుపు దాదాపు ఖాయమైందని చాలామంది భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత వారికి ఇంకాస్త క్లారిటీ వచ్చేసింది. జగన్ తప్పకగెలుస్తాడని భావిస్తున్న వారిలో ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. అందుకే వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు..


అదేమిటంటే.. ప్రముఖ ఆద్యాత్మికవేత్త చిన జియ్యర్ ఆశీస్సుల కోసం వారు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారట. జీయర్ స్వామిని హైదరాబాద్ లోని ఆశ్రమంలో కలిసి తమ విన్నపాలు విన్నవించుకుంటున్నారట. జగన్‌కూ చినజీయర్ స్వామికీ లింకేమిటంటారా..? 

ఎన్నికలు జరగడానికి కొద్ది రోజుల ముందు జగన్ శంషాబాద్ వద్ద చిన జియ్యర్ స్వామిని కలిసి పాదాభివందనం చేశారు. ఆయన ఆసీస్సులు తీసుకున్నారు. దీంతో జగన్ ఈ స్వామీజీకి ప్రయారిటీ ఇస్తారన్న టాక్ వచ్చింది. 

దీనికితోడు కేసీఆర్ చిన్నజీయర్ స్వామికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే.. అందుకే ఎందుకైనా మంచిదని ఐఏఎస్ అధికారులు చిన్న జీయర్ స్వామిని కలుస్తున్నారట. జగన్ ముఖ్యమంత్రి అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నది వీరి విన్నపం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: