రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపును ఎవరూ ఆపలేరు.. 18 నుంచి 20ఎంపీ స్థానాలు మనం గెలుస్తున్నాం... 110 అసెంబ్లీ స్థానాలతో మన గెలుపు ప్రారంభమవుతుంది.. ఇది 120 నుంచి 130 వరకూ వెళ్లొచ్చు.. 


ఇదీ చంద్రబాబు ధీమా.. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో చేసిన కామెంట్లివి.. నూటికి నూరు శాతం మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. అంతేకాదు.. జగన్ తీరుపై పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. 

మైండ్ గేమ్స్ తో జగన్ గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు చంద్రబాబు. ఈ మాయలో ఎవరూ పడొద్దని.. ఇవన్నీ జగన్ జిమ్మిక్కులేనని కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని విమర్శించారు చంద్రబాబు.

అంతేకాదు.. రేపు మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి దిల్లీలో ధర్నా చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. వీవీపాట్లు లెక్కించాలనే డిమాండ్ పై ఢిల్లీలో ఆందోళన చేస్తారట. ఎన్నికల కమిషన్ దుర్వినియోగం పట్ల అంతా అలర్ట్ గా ఉండాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 

మోదీ అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారంటున్న చంద్రబాబు... వీవీపాట్ల లెక్కింపులోను చాలా జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేస్తున్నారు. 22వ తేదీ కౌంటింగ్ ప్రక్రియపై టీడీపీ ఏజంట్లకు  మరోమారు శిక్షణ నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: