నిన్న వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ నేప‌థ్యంలో ఏపీ రాజ‌కీయాల్లో వేడి పుంజుకొంది. టీడీపీ క‌చ్చితంగా 130 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని జోశ్యం చెప్పారు టీడీపీ నేత బుద్దా వెంక‌న్న‌. ఈ మేర‌కు మీడియా స‌మావేశంలో తొడ‌గొట్టి మ‌రీ చెప్పారాయ‌న‌. 


అస‌లు నిన్న వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవీ నిజం కావ‌ని ఆరోపించారు బుద్దా వెంక‌న్న. ఏపీపై వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో అస‌లు నిజాలే లేవ‌ని అన్నారు. టీడీపీ 130 స్థానాలు గెలిచి తీరుతుంద‌ని తొడ‌గొట్టి మ‌రీ ధీమా వ్య‌క్తం చేశారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వేను మించి టీడీపీకి సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. 


కాగా.. 2014 ఎన్నిక‌ల టైమ్‌లో కూడా వైసీపీ నేత‌లు ఇంత‌కంటే ఎక్కువే ఊహించుకున్నార‌ని చెప్పారు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫ‌లితం వ‌చ్చింద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. వైసీపీ ఓట‌మి కాయ‌మని జ‌గ‌న్‌కు కూడా తెల‌స‌ని అన్నారు. 


ఇక మ‌రోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌పై తెలుగు త‌మ్ముళ్లు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. టీడీపీదే గెలుపు ఖాయమని వివరించారు. జ‌గ‌న్‌తో క‌లిసి మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని ఆరోపించారు. నాలుగోసారి కూడా చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని చెప్పుకొచ్చారు బుద్దా. 



మరింత సమాచారం తెలుసుకోండి: