ఎవరింటికైనా వారు పిలిస్తే మనం వెళితే మనకు గౌరవం దక్కుతుంది. అలా కాకుండా వేలపాళ లేకుండా వాళ్ళింటికి వెళితే వాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే దీన్నే పిలవని పేరంటానికి వెళ్ళటం అంటారు. అలా పిలుపు లేని చోటుకి పదే పదే వెళ్ళటంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుణ్ణి ఢిల్లీలో అందరూ 'ఫెవికాల్ బాబా' అని పిలుస్తున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన 2019, మే 20 వ తేదీ సోమవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. చంద్రబాబు బీజేపీయేతర పార్టీలను కలుస్తుండడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటానికి గాను అందరి ఇళ్లకు వెళ్ళి వారిపై పడి ఫోటోలు దిగుతూ, 'వాళ్లను కలుపుతా!' 'వీళ్లను ఏకం చేస్తా!'అంటుంటే ఈ నిక్-నేమ్ తగిలించారట. ఎన్నికలల వేళ ఎవరి ఉద్రిక్తలలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఫెవికాల్ బాబా రాయబారాలు ఏమిటని జోకులేసుకుంటున్నారు" అని ట్విట్టర్ లో తెలిపారు.
అంతేకాకుండా, "ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయావతి, అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధి, శరద్ పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నట్లు అలాగే సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వసమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట" అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు పెడుతున్నారు.
Vijayasai Reddy V
✔
@VSReddy_MP
ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట.
690
11:09 AM - May 20, 2019
Twitter Ads info and privacy
175 people are talking about this