కొందరి ఆత్మవిశ్వాసం భలే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే...అనుమానాలను సైతం కలిగిస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ విజయం గురించి తాజాగా ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు ఇదే అనుమానాన్ని కలిగిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తమ పార్టీ గెలుపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సంక్షేమాన్ని నమ్మారు... సీఎం చంద్రబాబును కూడా నమ్మారు.. టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేకు మంచి తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయన్నారు.
టీడీపీకి 130 సీట్లు గ్యారెంటీ అని పేర్కొన్న బుద్దా వెంకన్న టీడీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరగండి.. మన ప్రభుత్వం వస్తుంది. ఓవైపు టీడీపీ జెండా... మరోవైపు చంద్రబాబు ఫొటో ఉన్న జెండాలు రెండు బుజాలపై పెట్టుకుని ధర్జాగా తీరగాలని పిలుపునిచ్చారు. ఇదే అంశాన్ని తొడగొట్టి చెప్పడం గమనార్హం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందన్న విషయం వైఎస్ జగన్కు తెలుసని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీకి డుమ్మా కొడతారని వేరే వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారని సెటైర్లు వేశారు. బుద్ధా వెంకన్న ధైర్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.