సిద్ధిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గజ్వేల్ శివారులో గల సమాధి వద్ద మానసిక ఎదుగుదల సరిగా లేని ఓ బాలిక కామాంధుల చేతుల్లో నలిగి పోయింది. ఆరుగురు యువకులు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అతి కిరాతంగా ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. ఇక చివరకు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి జైళ్లో లెక్కెట్టిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరంలో దళిత బాలిక అమ్మానాన్నలు తన చిన్న తనంలోనే చనిపోయారు. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ సంరక్షణలో ఉంటోంది. ఇక అప్పడే కామాంధులు ఎంటరయ్యారు. రాయవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రహీం పాషా ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలిక వద్ద నుంచి ఫోన్ నెంబర్ సంపాధించాడు.
ఆ బాలిక ఫోన్ నెంబర్ తీసుకున్న రహీంపాషా.. తన స్నేహితుడు వెంకట్కు ఇచ్చాడు. ఇక వాడు ఆ బాలికకు ఫోన్ చేసి ‘నీకు ఎవరూ లేరు కదా.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్న వెంకట్.. తన కామకోరికలను తీర్చుకున్నాడు. ఇక ఆ కామాంధుడు వెంకట్ తన స్నేహితులతో చెప్పాడు.
ఈ నెల 15న రాత్రి వెంకట్ రమ్మంటున్నాడని చెప్పి ఆంజనేయులు అనే వ్యక్తి బాలికను బైక్పై తీసుకెళ్లాడు. ఆ బాలికను ఊరి బయటకు తీసుకెళ్లి ఓ పత్తి చేలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక అదే రోజు రాత్రి గజ్వేల్ శివారులో గల ఓ సమాధి వద్ద ఆ బాలికను దింపాడు.. అనంతరం వెంకట్కు సమాచారం ఇవ్వడంతో వాడు కాస్త వాడి మరో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి అక్కడకు వచ్చాడు.
ఇంకేముంది ఆ బాలికపై అతి కృరంగా ప్రవర్తించారు. ఆరుగురు కామాంధుల చెరలో ఆ బాలిక నలిగిపోయింది. సమాధి పక్కనే ఆమె కర్కశంగా ప్రవర్తించారు కామాంధులు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను తన ఇంటికి సమీపంలో వదిలేసి.. ఆమె చెవులకు ఉన్న బంగారు దుద్దులను తీసుకుని జంప్ అయ్యారు.
ఇక ఎలాగో అలా తన నానమ్మ ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దీంతో వరు జగ్దేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడి గాలించి.. నిందితులను అరెస్ట్ చేశారు..