హైద‌రాబాద్ ఎస్ ఆర్‌న‌గ‌ర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆమెను స‌రిగా చూడ‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కాగా.. మొద‌టి భార్య ఉండ‌గానే ఓ వ్య‌క్తి మ‌రో మ‌హిళ‌ను నెల రోజుల క్రితం పెళ్లి చేసున్నాడు. 


మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన చెన్న‌కేశ‌వులు అనే వ్య‌క్తి పొట్ట కూటి కోసం న‌గ‌రానికి వ‌చ్చాడు. త‌న భార్య‌ను ఊరిలోనే వ‌దిలి పెట్టి వ‌చ్చాడు. ఈ నేప‌థ్యంలో అతడు మోతీన‌గ‌ర్‌లో ఉంటూ కూలిప‌ని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అత‌డికి ల‌క్ష్మీ అనే 24 ఏళ్ల మ‌హిళ ప‌రియ‌చం అయింది. 

ఇక అలా ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారడంతో నెల రోజుల క్రితం వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న మొద‌టి భార్య‌తో చ‌నువుగా ఉంటూ త‌న‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేసుకున్నావంటూ చెన్న కేశ‌వులుతో గొడ‌వ‌కు దిగింది. 


అయితే గ‌త శ‌నివారం వీరిద్ద‌రి మ‌ద్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆ మ‌హిళ బాధ‌తో ఇంట్లో కి వెళ్లింది. ఫ్యానుకు చీర‌తో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ల‌క్ష్మీ ఆవేశంగా లోప‌లికి వెళ్లిన విషయాన్ని గ‌మ‌నించిన స్థానికులు.. వెంట‌నే త‌లుపులు ప‌గుల గొట్టారు. 


వెంట‌నే వారు త‌లుపులు ప‌గుల‌గొట్టి లోప‌లికి వెళ్లారు. కానీ అప్ప‌టికే ఆ మ‌హిళ మృతి చెందింది. దీంతో వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు స్థానికులు.. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: