లగటిపాటి శపధాలు చేయడం కొత్తేమి కాదు. రాష్ట్ర విభజనకు ముందు కూడా శపథం చేశాడు దాన్ని పాటించాడు కూడా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. విభజన జరిగితే రాజకీయ సన్యాసమేనన్న లగడపాటి తన మాటను నిలబెట్టుకోవటమే కాదు.. రాజకీయాలకు దూరంగా ఉండటం షురూ చేశారు. కాకుంటే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావటం చేస్తుంటారు.


తాజాగా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్  నేపథ్యంలో ఆయన మరోసారి శపధం చేశారు. తాను చెప్పినట్లుగా జరగకపోతే.. మరెప్పటికీ సర్వేలు చేయనన్న భారీ మాటను చెప్పేశారు.ఇంత పెద్ద మాట లగడపాటి నోటి నుంచి వచ్చిన తర్వాత బాబు గెలుపు పక్కా అని భావించినోళ్లంతా.. విభజన నాటి అయ్యగారి శపధం గురించి గుర్తు తెచ్చుకుంటే మంచిందంటున్నారు.


ఇప్పటివరకూ గెలుపు ధీమాతో ఉన్నోళ్లు.. లగడపాటి మాటలతో మరింత పెరిగిన వేళ.. ఈవీఎంలు తెరిచిన తర్వాత అందుకు భిన్నమైన ఫలితం వస్తే తట్టుకోవటం కష్టం. అందుకు.. రానున్న మూడు రోజుల్లో మెంటల్ గా ప్రిపేర్ కావటం మంచిదంటున్నారు. అచ్చిరాని శపధాలతో లగడపాటి సర్వేలు చేయించుకునే అవకాశాన్ని తనకు తానుగా వదులుకుంటే.. ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు ఈసారి ఆయనే మాధ్యమాన్ని ఉపయోగించుకుంటారన్న ప్లాన్ ఏమైనా చేసుకున్నారా? 

మరింత సమాచారం తెలుసుకోండి: