ఏపీలో జగన్ హాట్ ఫావరేట్ అని ఎగ్టిట్ పోల్ సర్వేలు చెప్పేశాయి. రాబోయేది జగన్ సర్కార్ అని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రీ పోల్ ఎగ్టిట్ పోల్ సర్వేలు గట్టిగానే తీర్మానించాయి. మరి కొద్ది గంటల్లో అసలు ఫలితాలు వస్తాయి. అయితే అవి లాంచనమేనని వైసీపీ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది.


ఇదిలా ఉండగా డిల్లీలో మళ్ళీ పాగా వేసేది మోడీ సర్కారేనని మొత్తానికి మొత్తం ఎగ్టిట్ పోల్స్ పెద్ద గొంతుతో చెప్పాయి. మరి ఆ ఆనందం కమలనాధులని తిన్నగా ఉండనీయడంలేదట. దాదాపు రెండు నెలల పాటు ప్రచారం చేస్తూ బాగా అలసిపోయిన మోడీ షా, ఇతర బీజేపీ నాయకులంతా తమ శ్రమకు తగ్గ ఫలితం వస్తోందన్న  ఆనందంతో విందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారట.


ఈ విందు పార్టీకి బీజేపీ పరివారంతో పాటు, కేంద్రమంత్రులు  ఎండీయే మిత్ర పక్షాలు హాజరవుతారట. అదే విధంగా న్యూట్రల్ పార్టీలుగా ఉన్న టీయారెస్, వైసీపీ బిజూ జనతాదళ్ ని పిలవాలని డిసైడ్ అయ్యారట. మరి ఈ ఇన్విటేషన్ కి జగన్ ఏమంటారో.  డిల్లీలో  రోజు రాత్రి జరిగే పార్టీకి హాజరవుతారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: