ఏపీలో వైసీపీ విజయఢంకా మోగించబోతోందని ప్రముఖ వార్తా సంస్త.. ఇండియా టుడే తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో పద్దెనిమిది స్థానాలలో గెలవబోతోందట. ఆరు సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట.
విశాఖ సీటు మాత్రం జనసేన అభ్యర్ది వివి లక్ష్మీనారాయణ గెలిచే అవకాశం ఉందట. ఆ సంస్థ తన వెబ్ సైట్ లో ఎంపీ సీట్ల వివరాలు కూడా వెల్లడించింది. వైసీపీ గెలిచే బాబితాలో అరకు, విజయనగరం, తిరుపతి, నెల్లూరు, కడప, రాజంపేట, హిందూపూర్, నరసరావుపేట, నర్సాపురం, ఒంగోలు, బాపట్ల, ఏలూరు,
అమలాపురం, కాకినాడ, అనకాపల్లి, కర్నూలు,నంద్యాల ఉన్నాయి.
ఒక్క విశాఖపట్నం ఎంపీ సీటును మాత్రం ఇండియా టుడే జనసేన ఖాతాలో వేసింది. ఇక్కడ సీబీఐ మాజీ జెడీ పోటీ చేసారు. ఇక పోటాపోటీ ఉన్న స్థానాలు ఇవీ.. శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, చిత్తూరు
మిగిలిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ నెంబర్లు ఇచ్చి వదిలేశాయి. ఇండియ టుడే మాత్రం ఏ ఏ స్థానంలో ఏ పార్టీ గెలిచే అవకాశముందో అంచనా వేస్తూ చెప్పింది. మరి.. ఈ లెక్కలు ఎంతవరకూ కరెక్ట్ అవుతాయో చూడాలి.