తిరుపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్నికల అధికారులు కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రమాద సమయంలో కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలు ఉన్నాయా? లేవా? ఉంటే సురక్షితంగా ఉన్నాయా? అనే విషయాలపై అధికారుల నుంచి క్లారిటీ రావడం లేదు. అయితే గతంలో ఎన్నికల పోలింగ్ కు ముందు కూడా ఇలాగే ఇదే కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఇలా రెండు సార్లు ఒకసారి పోలింగ్ కు ముందు.. మరోసారి కౌంటింగ్ కు ముందు అగ్నిప్రమాదం జరగడంపై వైకాపా నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకతాళీయంగా జరిగిన ప్రమాదం కాదని.. దీని వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
అసలే ఓటమి భయంతో ఉన్న చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడే అవకాశం ఉందని.. వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. మరి ఇది అధికారుల నిర్లక్ష్యమా.. ఏదైనా మతలబు ఉందా అనే విషయం తేలాల్సి ఉంది.