ఏపీ ఎన్నికల ఫలితాలపై అంతటా ఉత్కంఠ నెలకొంది. కొన్ని వందల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పటికే వెలుగుచూశాయి. అయితే తాజాగా విజయవాడకు చెందిన నహీద్ అనే యూకేజీ చదువుతున్న బుడ్డోడు తన ఎగ్జిట్ పోల్స్ చెప్పాడు. 


టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే 5 నుంచి 15 సీట్లు ఎక్కువగా వస్తాయని తేల్చి చెప్పాడు. వైసీపీకి 63 నుంచి 72 సీట్ల వరకు వస్తాయంటున్నాడు. జనసేనకు గరిష్టంగా 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని వివరించాడు. అయితే ఇక్కడే ఉంది అసలు మతలబు. 

యూకేజీ పిల్లాడు ఎగ్జిట్ పోల్ చెప్పగలుగుతాడా.. ఒకవేళ చెప్పగలిగినా.. ఏ ప్రాతిపదికన చేశాడు.. సర్వే చేశాడా.. ఊహించాడా.. విశ్లేషించాడా.. ఈ విషయాలేవీ ఆ పిల్లోడు వివరించలేదు. అసలు వివరించేంత సీన్ కూడా లేదు. 

అయినా తెలుగుదేశం గెలుస్తుందని చెప్పాడు.. కదా.. అంతకంటే ఇంకేం కావాలి అంటూ ఎల్లో మీడియా రెచ్చిపోయింది. కనీస అవగాహన లేని యూకేజీ పిల్లోడు చెబితే.. ఏ మాత్రం కామన్ సెన్స్ లేకుండా దాన్ని ఎల్లో మీడియా హైలెట్ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: