దేశ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కి పోతున్నాయి. మరికొద్ది గంటల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైన రాజకీయ నేతల భవితవ్యం తెలిపోనుంది.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా కౌంటింగ్ వద్ద భారీ భద్రత ఏర్పాటు కు ఈసి చర్యలు తీసుకుంటుంది.  అయితే ఈవీఎం ల వద్ద ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం అని చెబుతున్నారు అధికారులు. తాజాగా తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 


ఏసీలో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలు ఉన్నాయా?. లేవా?. ఉంటే సురక్షితంగా ఉన్నాయా? అనే విషయాలపై అధికారుల నుంచి సమాచారం లేదు. ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఎండ వేడిమి కారణంగానే ఏసీలో ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  


టిడిపి వర్గాలు తెలుసుకొని, అక్కడికి వచ్చేసరికి,ఓ కర్ణాటకా రిజిస్ట్రేషన్ కారు, వేగంగా బయటకు వచ్చి దూసుకుపోయింది.  అక్కడి ఎస్ ఐ అని అడిగితే తడబాటుతో ఇప్పుడే విధులకు వచ్చానని చెప్పిన్నట్టు, టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇవిఎంలకు ఏమీ కాలేదని చెబుతున్నారు. అయినా ఇవిఎంల మీద ఇంత రచ్చ జరుగుతున్నా, ఏదో జరుగుతోందని గుబులుగా వున్న సమయంలో, ఇలాంటి నిర్లక్ష్యం ఏమిటో...ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రజ. కాగా, ఇదే కాలేజీలో పోలింగ్ కు ముందురోజు కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో మానిటరింగ్ రూమ్ లోని ల్యాప్ టాప్ లు అగ్నికి ఆహుతయ్యాయి. మళ్లీ అదే కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: