లగడపాటి తాజా సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫుల్లుగా ఫైర్ అయ్యారు. తెలుగుదేశంపార్టీనే గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో చెప్పినా దాన్ని బోగస్ గా మంత్రి కొట్టి పారేశారు. ఎక్కడో కూర్చుని కొందరితో మాట్లాడేసి సర్వే అంటే ఎలాగంటూ మండిపడ్డారు. లగడపాటి సర్వేలన్నీ కేవలం బెట్టింగ్ రాయళ్ళ కోసమే అని కూడా మంత్రి తేల్చిపారేశారు.

 

జాతీయ మీడియా సంస్ధల్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాయని తేల్చేశాయి. అదే సమయంలో రాష్ట్రంలో సర్వే నిర్వహించిన లగడపాటి మాత్రం టిడిపి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఆ సర్వేనే పట్టుకుని టిడిపి నేతలు ఊగుతున్నారు. జాతీయ మీడియా చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేని కాదని లగడపాటి విడుదల చేసిన సర్వేనే ప్రమాణికమన్నట్లుగా టిడిపి నేతలు మాట్లాడుతున్నారు.

 

ఇటువంటి నేపధ్యంలోనే చింతకాయల లగడపాటి సర్వే అంగా బోగస్ తేల్చేయటం టిడిపి నేతలకు మింగుడుపడటం లేదు. లగడపాటి సర్వే ఆధారంగా బెట్టింగులు కట్టిన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ మండిపోయారు. ఎటువంటి శాస్త్రీయత లేకుండా లగడపాటి చేసిన సర్వేని నమ్ముకోవద్దంటూ చింతకాయల హెచ్చరించటం గమనార్హం.

 

నిజానికి ఆదివారం లగడపాటి విడుదల చేసిన సర్వే వివరాలు రాత్రికే బోగస్ అని తేలిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకోవటానికి, తమ్ముళ్ళల్లో కాస్త ఆత్మస్ధైర్యం నింపటానికే లగడపాటి సర్వే పనికొస్తుందని టిడిపిలోనే చర్చ జరుగుతోంది. ఇటువంటి సమయంలోనే చింతకాయల బాహాటంగా లగడపాటి సర్వేపై మీడియాలో మండిపడటం సర్వత్రా చర్చ నడుస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: