కౌంటింగ్ కు  రెండు రోజులు మాత్రమే సమయం. నరాలు తెగే ఉత్కంఠ. అధికారం మార్పిడి కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ హోరా హోరీ తలపడ్డాయి. సీఎం సీటు నాదంటే నాదని ఢీ కొట్టాయి. వెయ్యి శాతం మాదే గెలుపు అని టీడీపీ అధినేత అంటే ఆరు నూరు అయినా గెలవబోయేది వైసీపీయేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఈ నేపధ్యంలో ఏపీ రాజధాని విజయవాడలో రూములన్నీ హౌస్ ఫుల్ బోర్డ్ చూపిస్తున్నారు. లాడ్జీలు, హొటళ్ళు ఎక్కడ చూసినా రూములు లేవనే చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న జనమంతా విజయవాడ మీద పడిపోయారు. బెట్టింగ్ రాయుళ్ళు రెడీ అంటూ రాజధానిలోనే సవాల్ చేస్తున్నారు. 


మా పార్టీ గెలుస్తుందంటే మీఅమె అంటూ పందెం రాయుళ్ళు తెగ తొందర పడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే విజయవాడ అసలే రద్దీకి మారు పేరు. ఇపుడు కౌంటింగ్ పుణ్యమాని రెట్టింపు జనాభాతో అట్టుడుకుతోంది. విజయవాడలో పెద్ద  జాతర జరుగుతోంది. ఉత్సవంలా జనం కనిపిస్తున్నారు. ఉప్పెనలా తరలివస్తున్నారు. బెజవాడ ఎండలకు మించి హీట్ పుట్టిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: