ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు గురించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్‌వైకేఎస్‌ జాతీయ వైస్ చైర్మన్ విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయ‌న దేశవ్యాప్తంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అన్ని రకాల సర్వే సంస్థలు చెప్పాయని, ఇది ఓర్చుకోలేని ప్రాంతీయ పార్టీలు ప్రజలని మభ్యపెడుతున్నాయని మండిప‌డ్డారు. ``బీజేపీ దేశంలో సొంత మెజార్టీ తో అధికారంలోకి వస్తుంది. అయినా చంద్ర‌బాబు హ‌డావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఇంత హడావుడి చేయడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల సొమ్మును ఉపయోగిస్తూ హడావిడి చేస్తున్నారు. బాబును రాజకీయ దళారిగా అందరూ చూడాల్సిన అవసరం ఉంది.`` అని అన్నారు.  


2014 త‌మతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుఅప్పటి ఎగ్జిట్ పోల్స్ నమ్మాలి అని అన్నార‌ని, అదే వ్యక్తి ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్  తప్పు పడుతూ సర్వే సంస్థలను తిడుతున్నాడని విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ``1984లోనే టీడీపీకి సర్వే చేసాను అని చంద్రబాబు అంటున్నారు. కానీ ఆయనకు మతిమరుపు అనుకుంటా... అప్పుడు బాబు గారు కాంగ్రెస్‌లో ఉన్నారు...అంటే అప్పటి నుండే వెన్నుపోటు రాజకీయాలు స్టార్ట్ చేసారా?`` అని సూటిగా ప్ర‌శ్నించారు. ``ఢిల్లీలో చంద్రబాబును ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా వస్తేనే భయపడుతున్నారు. ఎందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు? సుప్రీంకోర్ట్ మొట్టికాయలు వేసిన ఆయన ఆగడం లేదు. ఓటమి తరవాత ఈవీఎంలను, ఏపీ ప్రజలను తిట్టవద్దని విజ్ణప్తి. మీరు పిలిచి ఏర్పాటు చేసిన మీటింగ్ కు ఎందుకు స్టాలిన్, కుమార స్వామి ఎందుకు రాలేదు.?ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్ర‌లో టీడీపీ ఆఫీస్ గాంధీ భవన్ గా మారుతుంది.`` అని కోరారు. 


చంద్రబాబు ఒక ఐరెన్ లెగ్ అని ఎక్కడ అడుగుపెడితే అక్కడ అంతా నాశనమ‌ని విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ``తెలుగుదేశం నేతల ఓవర్ యాక్షన్ ప్రజలు భ‌రించలేకున్నారు . తగ్గిస్తే మేలు అని సలహా ఇస్తున్నాం. సినిమా వినోదాన్ని అందించే విధముగా ఉన్నాయి. లగడపాటి సర్వేలో టీడీపీ గెలుస్తుంది అని చెప్తూనే...బెట్టింగ్‌లో జగన్ గెలుస్తాడు అని అంటున్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే లగడపాటి సర్వే త‌ప్ప మ‌రెందుకు కాదు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన సర్వేని నమ్మి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.మ‌ళ్లీ ఆయ‌న స‌ర్వేను న‌మ్ముకుంటే అదే జ‌రుగుతుంది.`` అని స్ప‌ష్టం చేశారు.


కౌంటింగ్ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చేసే విధంగా టీడీపీ నేత‌లు ప్రణాళికలు ర‌చించార‌ని విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి ఆరోపించారు. ``ఫలితాల తరవాత జరిగే అల్లర్లకు ఈసీ, పొలీస్ శాఖ భద్రత ఏర్పాటు చేయాలి. చంద్రబాబు ఎప్పుడు వ్యవస్థ లను భ్ర‌ష్టుపట్టించే విధంగా పని చేస్తారు. ఇంత తప్పుడు పనులు చేసే బాబును దేశ ద్రోహి అనడంలో తప్పేం లేదు అని అనిపిస్తుంది`` అని వ్యాఖ్యానించారు. బీజేపీ నుండి దూరంగా వెళ్లి చంద్ర‌బాబు త‌మకు న్యాయం చేశారని వ్యాఖ్యానించారు.  ``చంద్ర‌బాబు వస్తా అని ప్ర‌క‌టించిన బీజేపీ గేట్లు మూసేసాం. జాతీయ నేత‌ల‌ను క‌లుస్తున్న చంద్ర‌బాబు ఎవరి దగ్గరికి వెళ్లిన వాళ్లందరికీ మిమ్మల్ని ప్రధానిని చేస్తా అని అంటున్నారు. లాలుప్రసాద్ తప్ప అందరికి మాట ఇచ్చారు ప్రధాని చేస్తా అని. టీడీపీ చరిత్రలో బీజేపీ లేకుండా ఎప్పుడైనా గెలిచారా? 23 తరవాత బాబుది ముగిసిన అధ్యాయం.`` అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: