తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకవేళ మే 23 తారీఖున వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలలో ఓడిపోతే — ఓటమి పాలైతే దానికి క్రింద పొందు పరచిన విషయాలలో ఏదైనా ఒకటీ కానీ, అన్నీ కలసి గాని కారణమని భావించాలి. లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అవుతారట.
1. ఈవీఎంలో చంద్రబాబు చెప్పినట్లు సైకిలుకు వేసిన ఓటు ఫానుకు పడినట్లు
2. ఎన్నికల సంఘం ఎన్నికల ముహుర్తాన్ని చంద్రబాబు ఓడిపోయేలా ప్రారంభించటం.
3. ఓటమికి కారణం బిజేపి లేదా ఎన్డీయే తో పొత్తు పెట్టుకోవటం
4. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు గారు వల్లించిన వాస్తు లోపాలు చంద్రబాబు ఓటమికి కారణాలట.
*అమరావతి నగర ప్రారంభోత్సవానికి పెట్టిన ముహూర్త లోపమట.
*అమరావతి నగరాన్ని సచివాలయం రెండింటిని వాస్తు లేకుండా నిర్మించటం. సీఎం కార్యాలయం ముందు శాసనసభ భవనాన్ని కట్టతం, ప్రత్యేకించి సచివాలయాన్ని రహదారి చివరన కట్టటం ఈశాన్యం గేట్ తప్ప మొత్తం సచివాలయ నిర్మాణం తప్పే. ముఖ్యంగా తూర్పు మూసివేయబడింది. మూకోణం రహదారి, రహదారి శూల అట.
5.తప్పు ఏవరు చేసినా అంటే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఎవరు చేసినా వాస్తు తప్పు ఉండటంతో ఆ పాపం అంతా ముఖ్యమంత్రికే చుట్టుకుంటుందట.
6. వైఎస్ జగన్మోహన రెడ్ది ముఖ్యమంత్రి అయినా ఆయన పాముకునేది ఏమీ ఉండదట. ఏ ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళినా ఆయనకు ఇదే పరిస్థితులు ఎదురవుతాయట.
7. ఈవీఎంలు వివిప్యాట్ లలోని టెక్నాలజీ లో మార్పులు జరపటం
8. ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయతం
9. ఏపి ప్రజా ప్రతినిధులపై వ్యాపారులు పారిశ్రామిక వేత్తలపై సిబీఐ ఈడి ఆదాయ పన్నుల శాఖ అధికారులు దాది చేసి అక్రమ సంపదను గుర్తించటం.
10. మొడీ, వైఎస్ జగన్, కేసీఆర్ తనపై, తన రాష్ట్రంపై, తన పార్టీపై కక్షగట్తతం
ఓటమి పాలైతే దానికి క్రింద పొందుపరచిన విషయాలలో ఏదైనా ఒకటీ కానీ, అన్నీ కలసి గాని కారణం కాదని భావించాలట.
1. ప్రజలకు యిచ్చిన 600 వాగ్ధానాలలో 60 కూడా నేరవేర్చక పోవటం కాదట.
2.ప్రజాధనం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ ప్రత్యేక విమానాలను ముఖ్యమంత్రి ప్రయివేట్ కార్యక్రమాలకు వాడటం, నవ నిర్మాణ, ధర్మ పరిరక్షణ దీక్షల నిర్వహణ,
3. సీఎం తన తనయుణ్ణి మంత్రిని చేయటం, ప్రతిపక్ష ఎమెల్యేలను కొనటం, మహిళా సాధికారత అంటే తన కోడలుకు మాత్రమే సాధికారత కలిపించటం ఇలా చేసిన పాపాలు కారణాలు కావట.
4. ప్రజా ప్రతినిధుల స్వంత ప్రైవేట్-బస్ ప్రమాదాలలో పదుల సంఖ్యలో జన మరణం,
5. పుష్కారాల్లో ముప్పై మందివరకు ముఖ్యమంత్రి ఆర్భాట ప్రచార చిత్రం చిత్రీకరిస్తుండగా త్రొక్కిసలాటలో మరణించటం కాదట.
6. ఇంటిల్లిజెన్స్ ఐజీతో సహా డిపార్ట్మెంట్ ను కుటుంబ రాజకీయ అవసరాలకు వాడేస్తూ మావోయిస్టులపై దృష్టిపెట్టక పోవటం తో ఒక శాసనసభ్యుడు మరో మాజీ శాసనసభ్యుడి హత్యలకు దారితియ్యటం.
7. ఇంకా కాల్-మని, సాండ్ మాఫియా, రెడ్ సాండల్ మాఫియా, వడ్డీ మాఫియా భూకబ్జా మాఫియా విద్యా వైద్య మాఫియాలు వెనుక టిడిపి ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటం.
8. అధికారులపై కొన్నిసార్లు మహిలలని కూడా చూడకునా వారిపై ప్రజా ప్రతినిధుల దౌర్జన్యాలు దాడులు
9. తన సామాజిక వర్గం వారికే కాంట్రాక్టులు వ్యాపారావకాశాలు పరిశ్రమలకు అనుమతులు కలిపించటం – తన కులం వాళ్లకే ఉద్యోగాలు ప్రమోషన్లు పోస్తింగులు ఇవ్వతం.
10. విభిన్న మత సంస్థలపై వ్యాస్థలపై దాదులు మందిరాలు, ప్రర్ధనాలయాల కూల్చివేత మొదలైన వాటిపై ప్రజాప్రతినిధుల దాడులు
11. తిరుమల తిరుపతి దేవస్థానములో జరిగే అపచారాలు, అక్రమ కార్యక్రమాలు ఇతర సంపదల దుర్వినియోగం
12. నిరంతరం అమరావతి పోలవరం పేర్లతో జరుగుతున్న ప్రజాధన దుర్వినియోగం
13. యూటర్నులు అనుకహ్సణం ఆదే అబద్ధాల మాయాజాలం
14. అమరావతి విశాఖ తదితర నగరాల్లో జరుగుతున్న భూకబ్జాల్లో తన స్వంతవాళ్ళదే సింహభాగం కావటం.
ఇలా చెపుతూ పోతే మహా గ్రంధమే అవుతుంది.