ఎగ్జిట్-పోల్స్ ఫలితాల ప్రకటనలతో తిరిగి అధికారంలోకి వచ్చేది బీజేపీ నాయక్త్వంలోని ఎన్డీయేనే అని తేలిపోయింది. అయితే బోటాబొటీ సంఖ్యా బలంతో నడుస్తున్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌ లోని ప్రస్తుత ప్రభుత్వాలు కూలిపోతాయని ప్రచారం జోరందుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ ప్రభుత్వం అధికారం కోల్పోవటం తధ్యమని రేపు సాయంత్రం వరకే హెచ్ డి కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారని కేంద్రమంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
Image result for karnataka ex cm siddaramaiah & Roshan Baig
కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు సరైన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ సిద్దరామయ్యపై నిన్న విరుచుకుపడిన అనంతరం సదానందగౌడ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు అసమర్థుడని, మాజీ ముఖ్యమంత్రి  సిద్ద రామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌-చార్జి కేసీ వేణుగోపాల్‌ జోకర్‌ అని రోషన్‌ బేగ్‌ వరసగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులందరిని తిట్టి పోసిన సంగతి తెలిసిందే. 
Image result for chandrababu rahul gandhi deve gowda
రేపు వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే అత్యధిక సీట్లు దక్కుతాయంటూ ఎగ్జిట్‌-పోల్స్‌ అంచనా వేసిన పలితాలు వచ్చిన నేపథ్యంలో రోషన్‌ బేగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో రోషన్‌ బేగ్‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్తపరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానించిన సదానంద గౌడ, రేపు సాయంత్రం వరకే కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని అనడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆస్తకికరంగా మారాయి. అంతేకాదు ఈ సందర్భంగా రోషన్‌ బేగ్‌ రాహుల్ గాంధి కి తన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని సూచన కూడా చేశారు.
Image result for roshan baig warned rahul gandhi
అంతేకాదు చంద్రబాబు తన చాణక్యంతో మోడీ సారధ్యంలోని బిజేపి ప్రభుత్వాన్ని కర్ణాటకలో గద్దె నెక్కకుండా జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణాన్ని అధికారంలోకి తెచ్చానని చెప్పుకుంటూ ఉంటారు. పాపం! ఆయనకూ ఈ సమాచారం భారమే కదా!   

మరింత సమాచారం తెలుసుకోండి: