ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన
అధికారి ద్వివేది మీడియా తో మాట్లాడుతూ కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు
మొదలు అవ్వనుంది అని మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం తెలియజేయనున్నాము అని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ
బందోబస్తును ఏర్పాటు చేశాం అని చెప్పారు.
అలాగే టీడీపీ శ్రేణులు చంద్రగిరి రిపోల్లింగ్ పై చేస్తున్న ప్రచారం లో నిజం లేదని అక్కడ జరిగినదంతా సీసీటీవీలో చూసాకే ఐదు బూత్ల రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నాం అని ద్వివేది ప్రకటించారు.పోలింగ్ రోజు జరిగిన అన్యాయాన్ని తమ నివేదికలో పేర్కోనకుండ నిజాలను దాచడానికి నాయకులకు సహకరించిన అధికారుల పై చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.
అలాగే కౌంటింగ్ కు ఏజెంట్లు తప్పకుండా పాసులు తీసుకోవాలని వారిని పోలీసులు తనిఖీలు చేశాకే లోపలికి పంపుతారు అని అసలు ఎవర్ని లోపలికి అనుమతించబోయేది లేదని అలాగే అందరూ పోలీసులకు సహకరించాలి అని ఆయన కోరారు.