పార్టీలో కొత్తగా చేరిన సినీనటి, అధికార ప్రతినిధి దివ్యవాణి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది. ‘కొత్తగా వైష్ణవం తీసుకున్న వాడు ఒళ్ళంతా పంగనామాలు పెట్టుకున్నాడు’ అన్న సామెత లాగుంది దివ్యవాణి యవ్వారం. నోటి కొచ్చింది ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తోంది జగన్మోహన్ రెడ్డిపైన. శిక్షణా తరగతులు పెట్టి కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేయాలని శిక్షణిచ్చింది టిడిపి. అయితే గొడవలు చేయమని వైసిపినే చెప్పిదంటూ దవ్యవాణి రివర్సులో మాట్లాడుతోంది.

 

పోలింగ్ రోజున అల్లర్లు చేసింది తెలుగుదేశం పార్టీనే అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే, ఆ రోజు జరిగిన గొడవల్లో దెబ్బలు తన్నది కట్లు కట్టించుకున్నది వైసిపి ఎంఎల్ఏలు, అభ్యర్ధులు నేతలే. చనిపోయిన ఇద్దరు కార్యకర్తలు కూడా వైసిపి వాళ్ళే. వాస్తవాలు ఇలా ఉంటే కౌంటింగ్ రోజున గొడవలు చేయటానికి వైసిపి ప్లాన్ చేస్తోందని ఎదురు ఆరోపించటమే విచిత్రంగా ఉంది.

 

వేలాది ఓట్లు తీయించేసిందే టిడిపి అయితే వైసిపినే ఫారం 7 సి ద్వారా  లక్షలాది ఓట్లు తీయించేసిందంటూ విచిత్రమైన ఆరోపణలు చేసింది. ఫారం 7 సి అంటే దొంగ ఓట్లు తీయించేయమని ఎన్నికల కమీషన్ కు రిక్వెస్టు చేసుకునే ఫారం అని కూడా తెలిసినట్లు లేదు ఈ నటీమణికి. పైగా ఓట్లు తీయించేసింది వైసిపి కాదు. ఆ పని చేయాల్సింది ఎన్నికల కమీషన్.

 

వైసిపి మైండ్ గేమ్ ఆడుతోందని దివ్యవాణి చెప్పటమే విచిత్రంగా ఉంది. పోలింగ్ జరిగిన తర్వాత నుండి ఇప్పటి వరకూ జగన్ అసలు నోరే విప్పలేదు. తామే గెలుస్తున్నామని, తమదే గెలుపని, టిడిపికి 150 సీట్లు ఖాయమంటూ వందసార్లు చెప్పుంటారు చంద్రబాబు. తెలుగుదేశంపార్టీని ఢిల్లీలోని కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పడేసిన చంద్రబాబు మొత్తం ఏపి పరువునే తీసేశారనటంలో సందేహమే లేదు. తప్పలన్నీ చంద్రబాబులో పెట్టుకుని ఎదురుదాడి చేయటమే విచిత్రంగా ఉంది. తనకన్నా ముందు ఇలా రెచ్చిపోయిన నటీమణుల సంగతేమైందో దివ్యవాణి ఒక్కసారి చూసుకుంటే మంచిది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: