నగరంలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కూతూరు స్నేహితురాలిపై అత్యాచారం చేసిన నిందితుడిని నారాయణ గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తెను చూసేందుకు వచ్చిన వ్యక్తి ఆమె స్నేహితులరాలిని గర్బవతి చేసి పరారయ్యాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇంత తతంగం జరిగిన ఇన్ని రోజులకు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తన కుమార్తె స్నేహితురాలితో పరిచయం పెట్టుకున్న అతడు.. మాయమాటలు చెప్పాడు.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన కామ కోరికలు తీర్చుకున్నాడు. చివరకు గర్భవతి చేసి.. అతడి తమ్ముడుతో కలిసి బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారు. దీంతో బాధితురాలు ఫలక్నూమా పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా ఈ కేసును పోలీసులు నారాయణగూడ పీఎస్కు బదిలీ చేశారు.
నల్గొండ జిల్లా, గడియాగవారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ హలీమ్ తయారీ కార్మికుడిగా పని చేసేవాడు. అతడి కూతురు కింగ్ కోఠీలోని ఓ ఇంట్లో పనికి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె తండ్రి తరచూ కూతురును చూసేందుకు నగరానికి వచ్చే వాడు. ఈ నేపథ్యంలోనే తన కుమార్తె స్నేహితురాలిపై అతడి కన్నుపడింది. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కామకోరికలను తీర్చికున్నాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. ఇక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
కాగా.. బాధితురాలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని మహ్మద్ షరీఫ్పై ఒత్తిడి చేసింది. దీంతో అతడు తమ్ముడు మహ్మద్ చంద్ తో కలిసి బెదించాడు. ఈ వషయం ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు పీఎస్లో కంప్లైయింట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.