ఢిల్లీలో మోహిత్ అనే టిక్ టాక్ సెలబ్రిటీ దారుణ హత్యకు గురయ్యాడు. మోహిత్ను ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. నజఫ్గఢ్ ప్రాంతంలోని ఓ ఫోటో స్టూడియోలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ లో మోహిత్కు 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాను నజఫ్గఢ్ ప్రాంతంలో ఫోటోల కోసం ఫోటో స్టూడియోకు వెళ్లడు. అక్కడ సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో కాల్పుల మోత.. ఎవరో గుర్తు తెలియని దుండగులు.. మోహిత్ను అతి దారుణంగా కాల్చి చంపారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ ఆ స్టూడియోలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మోహిత్పై కాల్పులు జరిపిన వారిలో ఇద్దరు దుండగులు వారిని ఎవరు గుర్తుపట్టరాకుండా మొఖానికి హెల్మెట్లను ధరించారు. అందులో మరొక దుండగుడు ముఖం మాత్రం సీసీ ఫుటేజీలో స్పష్టం కనిపిస్తోంది. మోహిత్పై కాల్పులు జరిపి అక్కడ్నుంచి పరాయ్యారని పోలీసులు తెలిపారు. మోహిత్ శరీరంలో 13 బుల్లెట్లు దిగినట్లు పోలీసులు తెలిపారు.
మోహిత్కు ఈ దుండగుల గ్యాంగ్తో ఏమన్న గొడవలు గానీ, ఘర్షణలు గానీ ఉన్నాయా.. ? లేక ఇంకా ఏదైనా ఇతర కారణమా..? లేకా వ్యక్తిగత కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇందులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. అదేంటంటే.. మోహిత్ జరిగిన ఘటన ప్రాంతంలోనే మరో ఇద్దరు క్రిమినల్స్ హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.