ఓ వైపు ఓట్ల లెక్కింపు..నరాలు తెగిపోయేలాంటి టెన్షన్ వాతావరణం..ఇలాంటి సమయంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి ఘటన కలకలం రేపుతోంది. భువనేశ్వర్ నుంచి అసిక వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం.

బ్రహ్మపుర బైపాస్ రోడ్ లో మనోజ్ వెళ్తుండగా వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. అంతే కాదు దుండగులు మరింత రెచ్చిపోయి అతనిపై  కత్తులతో  గాయపరిచి పారిపోయారు. 

ప్రస్తుతం గంజాం జిల్లా అస్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మనోజ్‌ జెన్నా కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు.  మనోజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  వెంటనే మనోజ్‌ జెన్నాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: