నేడు ఎన్నికల ఫలితాలు..ఎక్కడ చూసినా జనాలు టివిలకు అతుక్కు పోతున్నారు. భారీ భద్రత మద్య కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపిలో నేడు భవితవ్యం తేలనుంది. సీఎం ఎవరు అన్న ప్రశ్నకు నేడు సమాధానం రాబోతుంది..అయితే ఇప్పటి వరకు జరిగిన సర్వేల్లో ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు కూడా ప్రజలు తమపై గట్టి నమ్మకాన్నే ఉంచారని ఈసారి మార్పు ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు జరుపుకుంటున్నారు.