ఎంతో ఉత్కంఠ రేపుతున్న నియోజక వర్గంలో నెల్లూరు సిటీ ఒకటి. ఇక్కడ నుంచి టీడీపీ నేత నారాయణ బరిలో దిగి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుతున్న ఫలితాల ప్రకారం వైసీపీ అభ్యర్థి అనిల్ యాదవ్ ముందంజలో ఉన్నాడు.  రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా దీనిని చెప్పుకోవచ్చు. అందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రి నారాయణ పోటీ చేస్తూ ఉండటమే!


ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చాకా టీడీపీ తరఫున నామినేటెడ్ పదవిని తీసుకుని మంత్రి అయ్యారు నారాయణ. అలా తెలుగుదేశంపై తనకున్న పట్టేమిటో నిరూపించుకున్నారు. ఇక అంతటితో ఆగక.. నారాయణ ప్రత్యక్ష రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారంటే.. ఆయన తన విజయం మీద ఎంత నమ్మకంతో ఉన్నారో, ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. 


విద్యాసంస్థల యజమానిగా ఉన్నప్పుడు ‘నెల్లూరు నారాయణ’గా ఫేమస్ అయిన ఈయన ఇప్పుడు నెల్లూరు అర్బన్ నుంచినే తనసత్తా చూపించబోతూ ఉన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికతో ఉన్నారాయన. ఆ విషయం గ్రౌండ్ లెవల్ పరిశీలనతో స్పష్టం అవుతోంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరీ  కాసేపట్లో ఎవరు గెలవబోతున్నారో స్పష్టం అయిపోతుంది. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: