సర్వత్రా ఉత్కంఠతను రేపుతూ దాదాపు రెండున్న నెలల పాటు సాగిన 2019 ఎన్నికల చివరి అంకం ఫలితాల వెల్లడి రోజిది.  అందరూ ఊహించినట్లుగానే , ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, భారత దేశ లోక్ సభలో బీజేపీ కూటమి NDA శుభారంభం చేశాయి.

 

ఫలితాల మొదటి రౌండ్ నుండి వైసీపీ తన అత్యాధిక్యతను చాటుతూ తెదేపా ను తన దరిదాపులో లేకుండా తరిమి కొడుతుంటే..తెలాంణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ రాజకీయ ప్రత్యర్థులకు అవకాశమే లేకుండా విజయదుంధుభి మోగించడానికి తయారు ఉన్నట్లుంది ఫలితాల పరిస్థితి.

 

కాంగ్రెస్ మరియు యూపీఏ మిత్ర పక్షలా పరిస్థితి కడు దయనీయంగా ఉంది. ఇప్పుడు కథ మొదలయ్యిందని..మరో నాలుగు గంటల పాటు ఈ ఉత్కంఠత కొనసాగనుంది, ప్రతి సెకను, మీకు తాజా వార్తలను నిక్కచ్చిగా అందరికంటే ముందుగా అందిస్తుంది ఇండియాహెరాల్డ్ గ్రూప్.

 


మరింత సమాచారం తెలుసుకోండి: