అందరూ అనుకున్నట్టు విధంగానే జగన్ పార్టీ రికార్డు విజయంతో దూసుకు పోతుంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల చెప్పినట్టు విధంగా వైస్సార్సీపీ భారీ విజయం నమోదు చేసే విధంగా కనిపిస్తుంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్స్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తూ ఉంది. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యత కనబరుస్తూ ఉన్నారు.


పోస్టల్ బ్యాలెట్ ల కౌంటింగ్ లోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వెనుకబడి ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లలో తెలుగుదేశం అభ్యర్థుల్లో ఆధిక్యత కనబరిచింది కేవలం నారా లోకేష్ మాత్రమే. మంగళగిరిలో ఆయనకు  స్వల్ప ఆధిక్యత లబించిందని వార్తలు వస్తున్నాయి. ఈవీఎంల కౌంటింగ్ లో తొలుత ప్రకటించిన ఫలితం కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానానిది.


అక్కడ తొలి రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి పదకొండు వందలకు పైగా మెజారిటీని సాధించారు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అక్కడ సుధాకర్ యాదవ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. పులివెందుల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొలి రౌండ్ లో రెండు వేల ఓట్లకు పైగా మెజారిటీని సాధించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: