ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. అన్నింటికి మించి పెద్ద షాక్ ఏంటంటే ఏపీ సీఎం చంద్రబాబు పోటీ చేస్తోన్న ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఫస్ట్ రౌండ్లో వైసీపీ ముందంజలో ఉంది. తొలిరౌండ్ ఫలితం అనంతరం 67 ఓట్ల మెజారిటీతో వైసీపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కుప్పం నుంచి వైసీపీ తరుపున చంద్రమౌళి పోటీ చేశారు. చంద్రబాబే సొంత నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇక వైసీపీ ఏపీలో 100 సీట్లలో ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.