చంద్రబాబునాయుడుకు ఊహించని రీతిలో జనాలు పెద్ద షాకే ఇచ్చారు. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో వైసిపి బ్రహ్మాండమైన మెజారిటీతో దూసుకుపోతోంది. తాజ సమాచారం ప్రకారం రెండో రౌండు ఓట్ల లెక్కింపులో 23 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు 143 అసెంబ్లీల్లో మంచి మెజారిటీతో దూసుకుపోతోంది.

 

ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో మొదలైన ఓట్ల లెక్కింపులోనే జనాల నాడి ఏమిటో అర్ధమైపోయింది. ఎందుకంటే, పోస్టల్ బ్యాలెట్లలోనే వైసిపికి స్పష్టమైన ఆధిక్యత కట్టబెట్టారు. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లతోనే జనాల మూడ్ ఏమిటో అర్ధమైపోయింది.

 

చాలా నియోజకవర్గాల్లో  రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తియిపోవచ్చింది. కడపటి సమాచారం అందేసరికి వైసిపి స్పష్టమైన ఆధిక్యతను సాధించినట్లే కనబడుతోంది. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ ఉత్త డొల్లే అని జనాలు స్పష్టంగా తీర్పు ఇచ్చినట్లే అర్ధమైపోయింది. మరో నాలుగు రౌండ్లకు కూడా ఇదే విధమైన మెజారిటీలు కంటిన్యు అయితే వైసిపి 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమనే అనుకోవాలి. అదే దామాషాలో 23 ఎంపి స్ధానాల్లో కూడా విజయం ఖాయమవుతున్నట్లే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: