అఖండ మెజారిటీ
సాధించే దిశగా స్పీడు మీదున్న వైసిపి 26వ తేదీన కీలక సమావేశం అవుతోంది.
తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ఎల్పీ సమావేశం జరిపేందుకు
నిర్ణయమైంది. ఆరోజు సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని తమ నేతగా ఏకగీవ్రంగా ఎన్నుకోవటం
ఇక లాంఛనమే. అదే సమయంలో 30వ తేదీన ప్రమాణ
స్వీకారం చేయటానికి జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం
వైసిపి 151 అసెంబ్లీల్లో మంచి మెజారిటీతో ముందంజలో ఉంది. అదే విధంగా 24 ఎంపి
స్ధానాల్లో కూడా మంచి మెజారిటీతో దూసుకుపోతోంది. ఈరోజు సాయంత్రం చంద్రబాబునాయుడు
ముఖ్యమంత్రిగా రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే
వరకూ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.