వైసీపీ చారిత్రిత్మక విజయం నమోదు చేసే దిశగా సాగుతుంది. అయితే విజయసాయి రెడ్డి ఈ ట్విట్టర్లో లగటిపాటి  మీద రెచ్చిపోయాడు. తాజాగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఏపీలో చారిత్రక విజయం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పయనిస్తున్న వేళ.. ఆయన ట్వీట్ చేస్తూ.. లగడపాటిపై విరుచుకుపడ్డారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.


ఎన్ని శాంపిల్స్ తీశారు?   శాస్త్రీయంగా విశ్లేషించటానికి చేపట్టిన పద్ధతులేమిటో వెల్లడించాలన్నారు. ఒకవేళ ఆ విషయం మీద సమాచారం ఇవ్వకుండా ఆయనపై చీటింగ్ కేసు పెట్టి లోపలేయాలన్నారు.ఇంకోసారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలంటూ ట్వీట్ చేశారు.


వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయన్ను ఒక జోకర్ స్థాయికి తీసుకెళ్లిందన్న విజయసాయి రెడ్డి .. గత డిసెంబరులో మూడు హిందీ రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు.. వీవీ ప్యాట్ల గురించి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ.. నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలుగానే ట్వీట్లతో మోత పుట్టించే విజయసాయి.. చారిత్రక విజయం నేపథ్యంలో ఆయన ట్వీట్ల పదును మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: