ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం మామూలుగా లేదు. ఎవ్వరూ ఊహించనట్టుగా 150 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక లోక్సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 25 ఎంపీ సీట్లకు ఏకంగా 24 నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. వైసీపీ నాయకులే ఊహించని స్థానాల్లో లీడ్లో ఉంది. ఈ విజయం వైసీపీ అధినేత వైఎస్.జగన్కే పెద్ద షాక్ లాంటిది. ఈ విజయాన్ని బహుశా వైసీపీ అధినేత జగన్, అభ్యర్థులు కూడా ఊహించి ఉండరే అనుకోవాలి.
ఇక ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో.. రెండు జిల్లాల్లో టీడీపీ ఇంత వరకూ ఖాతా తెరువలేదు. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటి వరకు టీడీపీ ఒక్క చోట కూడా ఖాతా తెరిచే పరిస్థితి లేదు. ఇక వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోనూ 10కి 10 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే లీడ్లో ఉన్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు స్థానాల్లోనే టీడీపీ లీడ్లో ఉంది. ఏదేమైనా ఈ ఫలితాన్ని వైసీపీ అధినేత జగనే ఊహించి ఉండరనుకోవాలి.