ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టి వెలువ‌డుతున్నాయి. ముందుగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సీటు నుంచి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన ఉన్న‌మ‌ట్ల ఎలీజా విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి మాజీ మంత్రి పీత‌ల సుజాత విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అధిష్టానం సుజాత‌కు సీటు ఇవ్వ‌లేదు. 2009లో ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసిన క‌ర్రా రాజారావు తిరిగి ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఇక వైసీపీ నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉన్న‌మ‌ట్ల ఎలీజా గెలిచారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనే ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 33 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఆయ‌న ఘ‌న‌విజ‌యం సాధించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: