తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. 16 సీట్లు గెలుచుకుంటామ‌ని బీరాలు పోయిన టీఆర్ఎస్ నేత‌ల‌కు ఎన్నిక‌ల ఫ‌లితాలు అదిరిపోయే షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఓ చోట గెల‌వ‌గా... మ‌రో మూడు స్థానాల్లో ఆధిక్య‌తో ఉంది. ఇక బీజేపీ కూడా నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భువ‌న‌గిరిలో కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఘ‌న‌విజ‌యం సాధించారు. 


కోమ‌టిరెడ్డి 30 వేల ఓట్ల ఆధిక్యంతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఓట‌మితో టీఆర్ఎస్ అభ్య‌ర్థి బూర న‌ర్స‌య్య‌గౌడ్ కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశ‌తో వెనుదిరిగారు. ఇక నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 16 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 8 వేల ట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మల్కాజ్ గిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మధ్య ఆధిక్యత మారుతోంది. ఇక్కడ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: