పులివెందుల  నియోజకవర్గం లో తిరుగులేని మెజారిటీతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గెలుపు పతాకం ఎగురవేయబోతున్నారు. ఇప్పటికే గెలుపు దాదాపు ఖరారు అయిపోయింది. పులివెందుల ముందు నుంచి కూడా వైసీపీ కి కంచుకోట. అనుకున్నట్లు గానే జగన్ మోహన్ రెడ్డి గెలుపు దిశగా పయనిస్తున్నారు.టీడీపీ అభ్యర్ధి సతీష్ రెడ్డి ఏ మేరకు కూడా జగన్ కు పోటీ ఇవ్వలేకపోయాడు.

ప్రజలు జగన్ కే పట్టం కట్టారు. టీడీపీ శ్రేణుల్లో గెలుపు అవకాశాలు లేకపోయిన జగన్ కు గట్టి పోటీ ఇవ్వాలని భావించారు. అయితే వారికి గట్టి ఎదురు దెబ్బె తగిలింది.ఎక్కడ కూడా తన ఆధిక్యతను పోకుండా తొలి రౌండ్ నుంచే జోరందుకున్నారు. కడప జిల్లా మొత్తం గా జగన్ తన హవాను కొనసాగిస్తున్నారు. జగన్ అభిమానులు ఇంకా పూర్తి ఫలితాలు రాకముందే సంబరాలు మొదలు పెట్టేసారు.

ఇక్కడ జగన్ జోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపొయినా టీడీపీ ఈ సారి ఎలాగైనా జగన్ మెజారిటీకి  పెద్ద మొత్తంలో గండి కొట్టాలని ఆశించింది. అయితే వారి ఆశలు చివరికి అడియాశలు గానే మిగిలిపోయాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: