అనంతపురం జిల్లాలో నే టీడీపీ పార్టీ కి కంచు కోటగా భావించే రాప్తాడు నిజయోజకవర్గం కూడా జగన్ ధాటికి విలవిల లాడిపోయింది. కంచుకోట ను బద్దలు కొడుతూ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విజయకేతనాన్ని ఎగురవేశారు.మంత్రి పరిటాల సునీత ఈసారి బరిలో తాన్ కొడుకుని అరంగేట్రం చేయించి భారీ మూల్యాన్ని మూటగట్టుకుంది.

గెలుపు రేసులో తన తనయుడు శ్రీరామ్ నిలువలేకపోయాడు. ప్రజలు వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికీ పట్టం కట్టారుజగన్ తన ప్రభంజనాన్ని టీడీపీ నేతలు తమ కంచుకోటలు గా భావించే వాటి పై సైతం కూడా పంజా విసిరాడు. వారి ఆశయాలును అడిఆవిరి చేసి గెలుపుకు  చేరువయ్యాడు.

ప్రకాష్ రెడ్డి మంచి మెజారిటీ తో గెలుపు వైపు వెళ్తున్నాడు. చాలా కాలం నుంచి పరిటాల కుటుంబం కు కొమ్ము కాసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారు. ప్రజల నిర్ణయానికి మంత్రి సునీతకు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: