అయితే, ఈ ఫలితాల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మరోసారి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు కవితపై సెటైర్లు వేశారు. ``నేను కేసీఆర్కి, కేటీఆర్కి ఛాలెంజ్ చేసి భువనగిరి ఎంపీ స్థానం నుంచి మా అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గెలిపించుకున్నా` అని ప్రకటించారు. నల్గొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా అని మా అన్నను ఎద్దేవా చేశారు... మరి ఇప్పుడు నీ బిడ్డే చెల్లని రూపాయి అయ్యిందని రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇక జెడ్పీటీసీ ఎన్నికల్లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి మూడు జడ్పీ ఛైర్మెన్ సీట్లు కైవసం చేసుకుంటామని సవాల్ చేశారు కోమటిరెడ్డి. మరోవైపు రేపు ఎమ్మెల్సీగా నా సతీమణి లక్ష్మీ కూడా గెలువబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న కేసీఆర్ కి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ఫలితాల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మరోసారి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు కవితపై సెటైర్లు వేశారు. ``నేను కేసీఆర్కి, కేటీఆర్కి ఛాలెంజ్ చేసి భువనగిరి ఎంపీ స్థానం నుంచి మా అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గెలిపించుకున్నా` అని ప్రకటించారు. నల్గొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా అని మా అన్నను ఎద్దేవా చేశారు... మరి ఇప్పుడు నీ బిడ్డే చెల్లని రూపాయి అయ్యిందని రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇక జెడ్పీటీసీ ఎన్నికల్లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి మూడు జడ్పీ ఛైర్మెన్ సీట్లు కైవసం చేసుకుంటామని సవాల్ చేశారు కోమటిరెడ్డి. మరోవైపు రేపు ఎమ్మెల్సీగా నా సతీమణి లక్ష్మీ కూడా గెలువబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న కేసీఆర్ కి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.