ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టం గట్టిన ప్రజలు ఈసారి జగన్ వైపు మొగ్గు చూపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన దగ్గరి నుంచి అందరి చూపులు చిత్తూరు జిల్లాలోని నగరి వైపు ఉన్నాయి. నగరిలో వైకాపా నేత రోజా గెలుస్తుందా లేదా అనే దానిపై అందరికి ఆసక్తి నెలకొంది.
ఈ ఆసక్తికి తెరదించుతూ... అక్కడ రోజా భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2800 మెజారిటీతో విజయం సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువనే చెప్పాలి. ఐరెన్ లెగ్ అని.. ఎక్కడ రోజా అడుగుపెడితే అక్కడా విజయం ఉండదని చెప్పిన నేతలకు ఇది సైరైనా సమాధానం అని అంటోంది రోజా.
జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని.. ప్రజల నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయబోమని చెప్తోంది రోజా. ఎన్నికలు పూర్తయ్యాయి. రిజల్ట్ కూడా వచ్చేస్తోంది... ఇక మంత్రివర్గంపైనే అందరి చూపులు ఉన్నాయి. ఇప్పటికే గెలిచిన అభ్యర్థుల్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అనే దానిపై సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియాలో వచ్చినట్టు రోజాకు విధ్యుత్ శాఖను కేటాయిస్తారా చూద్దాం.