సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా దూసుకెళ్లిన ఎన్డీయే పై మిత్రపక్ష శివసేన ప్రసంశల వర్షం కురిపించింది. విజయం దిశగా దూసుకెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశాన ఎత్తుకుంది. మరో 25 ఏళ్ల పాటు మోదీకి దురే లేదని వ్యాఖ్యానించింది. అంతే కాదు.. మోదీకి కౌంటర్ ఇచ్చేవారు అంటూ ఇంకా ఎవరూ లేరని వ్యాఖ్యానించింది.
కాగా.. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన ఐదేళ్ల నుంచి బీజేపీపై విమర్శలు చేస్తూ వచ్చింది శివసేన. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు మళ్లీ తిరిగి బీజేపీతో కలిసిపోయిన సంగతి విదితమే. రాఫెల్ ఒప్పందంలాంటి విషయాలపై మోదీపై ప్రతిపక్షలు ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రజలు తమ ఓటుతో బలమైన సమాధానం చెప్పారని శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ తెలిపారు.
దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచారని అన్నారు.ఇక మోదీకి ఎవరు సాటిరారన్న విషయాన్ని అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. మరో 25 ఏళ్ల పాటు మోదీకి ఎవరూ సవాల్ చేయలేరని నిరూపించేందుకు నేడు ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమని రావత్ అన్నారు. ఆయనకు కౌంటర్ ఇచ్చేవరు ఇంకా ఎవరూ లేరని వ్యాఖ్యానించారు..