కుప్పం నియోజకవర్గం అనగానే గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు బాబు నాయుడు గారిది. ఎందుకంటే ఇక్కడ నుంచి పోటీ చేసిన ఆయన ఒక్కసారి కూడా ఒడిపోలేదు. ఈసారి కూడా విజయం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కే దక్కింది.

కుప్పం ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ కంచుకోట అని మరోసారి నిరూపించారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ నేత  చంద్రమౌళి ఓటమి పాలయ్యారు. జగన్ మేనియా ఈ ప్రాంతంలో పని చేయలేకపోయింది.ఇక్కడ పాలన ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ఎప్పుడు టీడీపీ వైపే ఉంటారు. కాని ఈసారి అధిష్టానం మారడంతో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలి.

వైసీపీ నేత పై అధిక మెజారిటీతో తో చంద్రబాబు గెలుపొందారు.ముందు నుంచి కూడా ఈ నియోజకవర్గం పై పెద్దగా శ్రద్ద పెట్టలేదని వైసీపీ నాయకులు అంటుంటారు. జగన్ కు ముందు నుంచి కూడా ఈ నియోజకవర్గం పై నమ్మకం లేదంట. కానీ ఈసారి అధిష్టానం లో జగన్ ఉండి ఇక్కడి ప్రజలను తదుపరి ఎన్నికలకు అయిన తన వైపు తిప్పుకుంటాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: