ధర్మవరం నియోజకవర్గం లో వైసీపీ తమ జెండాను రెపరేపలాడించింది. వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పూర్తి ఆధిక్యాన్ని చూపిస్తూ విజయాన్ని సొంతం చేసుకున్నారు. టీడీపీ నేత వరదపురం సూరి ఓటమి ని చవిచూడాల్సి వచ్చింది.అనంతపురం జిల్లా మాములుగా టీడీపీ నేతలకు బాగా కలిసివచ్చే జిల్లా అయితే ఈసారి మాత్రం ఈ జిల్లాలో కూడా ఘోర వైఫల్యం పాలయ్యింది.

జగన్ తన ఆధిక్యాన్ని ఈ జిల్లాలో కూడా కొనసాగించారు.ప్రజల తీర్పు వైసీపీ వైపే ఉంది , టీడీపీ పాలన తో అంత సంతృప్తి గా లేని ప్రజలు మార్పు కోసం జగన్ ను ఎంచుకున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు తీరుతాయని ఆశతో అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.మిగిలిన పార్టీలు ఏవి కూడా తమ ప్రభావాన్ని చూపలేకపోయాయి.

కనీసం ఓట్ల ఆధిక్యాన్ని కుడి ఆపలేకపోయాయి. జగన్ కి ఉన్న ఆదరణ కూడా తొడవడం వల్ల కేతిరెడ్డి విజయం సులువైంది. జగన్ తన ఎమ్మెల్యే లతో ఎలాంటి పాలన చేస్తాడో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: