హిందుపూర్ నియోజకవర్గం లో టీడీపీ పార్టీ తమ జెండాను ఎగురవేసింది. బాలయ్య తన బలాన్ని ,ఆధిక్యతను ప్రదర్శిస్తూ గెలుపుని సొంతం చేసుకున్నారు. టీడీపీ పార్టీ కి కంచుకోట గా ఉన్న ఈ నియజకవర్గం తమ స్తానాన్ని నిలుపుకోగలిగింది.వైసీపీ పార్టీ నేత ఇక్బాల్ అహ్మద్ తన ప్రభావాన్ని ఏ మేరకు చూపించలేదు. అన్ని చోట్లా పని చేసిన జగన్ మేనియా ఇక్కడ మాత్రం బెడిసికొట్టింది.

వైసీపీ అభ్యర్థి విషయం పై కాస్త శ్రద్ధ పెట్టివుంటే గెలుపు అవకాశలు మెరుగ్గా ఉండేవి.చాలా స్థానాలను కోల్పోయిన టీడీపీకి హిందూపూర్ నియోజకవర్గం మాత్రం పట్టు విడువలేదు. ఎప్పటి లాగే ఇక్కడి ప్రజలు టీడీపీ పార్టీకే పట్టం కట్టారు. అభివృద్ధి విషయం ఎలా ఉన్నా ప్రజలకు టీడీపీ పై అభిమానం చచ్చిపోలేదు.తొలి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ బాలయ్య ముందంజలో కొనసాగారు.

ఇతర పార్టీలు అసలు ఇక్కడ జాడ లేకుండా పోయింది. వైసీపీ నేత ఇక్బాల్ సరిగ్గా గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయాడు. అయితే అధిష్టానం మాత్రం తమ పార్టీదే అన్న విషయం పార్టీ శ్రేణులకు కాస్త ఊరట నిచ్చే అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: