ఆమంచి కృష్ణ మోహన్ చీరాల నియోజకవర్గం నుంచి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా భరిలోకి దిగి తన స్వంత ఛరిస్మాతో ఘన విజయం సాధించాడు. అయితే మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య శిష్యునిగా భావించే.. ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆమంచి ..  తెలుగురాజకీయాల్లో అత్యంత సీనియర్, అద్దంకి నియోజకవర్గంలో దశాబ్దాల పాటు వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువైన కరణం బలరామకృష్ణ మూర్తి తో పోటీ పడి 17419 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. 


ఇద్దరూ జిల్లాలో బలమైన కాపు, కమ్మ సామాజికవర్గాలకు చెందిన వారు కావడం, రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఉద్దండులు కావడంతో.. ఇక్కడ పోరు హోరా హోరీగా సాగుతూ.. విమర్శలు ప్రతివిమర్శల స్థాయి దాటి.. హైకోర్టుకు కూడా చేరింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు.


చివరి నిమిషంలో సీఎం చంద్రబాబు, జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్థన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన వైసీపీలో చేరడంతో టీడీపీ ఈ స్థానంలో ఆమంచిని ఓడించడమే లక్ష్యంగా కరణం బలరామకృష్ణమూర్తిని బరిలో నిలిపింది. దీనితో పోటీ హోరా హోరీగా సాగింది. చివరికి టీడీపీ అభ్యర్ధికి విజయం వరించింది. అయితే ఆమంచి ఇచ్చిన గట్టి పోటీని తక్కువ చేయలేం. 

మరింత సమాచారం తెలుసుకోండి: