తాజాగా వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన నుంచి పోటీ చేసిన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ సోదరుడు నరసాపురంలో ఎంపీగా ఓడిపోయారు. పార్టీ అధినేత పవన్కళ్యాణే తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. పవనే స్వయంగా ఓడిపోవడంతో నాగబాబు ఓటమిని చాలా మంది జనసేన అభిమానులు, మీడియా వర్గాలు లైట్ తీస్కొన్నాయి. అయితే ఇప్పుడు నాగబాబు ఓటమిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది.
గత కొద్ది రోజులుగా నాగబాబుకు శ్రీరెడ్డికి మధ్య తీవ్రమైన యుద్ధం నడిచింది. శ్రీరెడ్డి నాగబాబును టార్గెట్గా చేసుకుని ఎలా ? విరుచుకు పడిందో చూస్తూనే ఉన్నాం. ఇక మా ఎన్నికల్లో శివాజీరాజాకు నాగబాబుకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఈ ఎన్నికల్లో శివాజీరాజా ప్యానెల్పై నరేష్ ప్యానెల్ గెలిచింది. ఈ ఎన్నికల్లో నాగబాబు నరేష్ ప్యానెల్కు మద్దతు ప్రకటించారు.
ఇక మా ఎన్నికల్లో ఓడిన సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా నరసాపురంలో మాత్రం నాగబాబుకు ఎవ్వరూ ఓటేయవద్దని.. ఆయన పిల్లికి కూడా బిక్షం పెట్టడని.. తాను ఏ పార్టీకి ఓటేయమని చెప్పనని... నాగబాబుకు మాత్రం ఎవ్వరూ ఓటు వేయవద్దని చెప్పారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతం అంతా భీమవరం అని... భీమవరం పరిసర ప్రాంత ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా నాగబాబు ఇమేజ్ డ్యామేజ్ చేశాడన్న టాక్ ఇండస్ట్రీలో కొంత నడిచింది.
నాగబాబు మా ఎన్నికల్లో తన ఓటిమికి పనిచేశాడని.. దీనికి బదులుగా శివాజీరాజా త్వరలో రిటర్న్ గిఫ్ట్ అందుతుందని రిటార్ట్ ఇచ్చాడు. సరే ఇదంతా మాములే అని జనం లైట్ తీసుకున్నారు. తీరా ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే నరసాపురంలో నాగబాబు ఏకంగా మూడో ప్లేస్తో సరిపెట్టుకున్నాడు. ఈ ప్రాంతం అంతా శివాజీరాజా సొంత ప్రాంతం కావడంతో ఇక్కడ ఆయనకు మంచి వెయిట్ వచ్చింది. సరే తనవంతుగా శివాజీరాజా కూడా నాగబాబుకు ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.