ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదట ఇడుపులపాయలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఊహాగానాలు వచ్చినా.. జగన్ తన గెలుపు ఖాయమైన కొన్ని గంటల్లోనే క్లారిటీ ఇచ్చేశారు. అమరావతిలోనే ప్రమాణస్వీకారం ఉంటుందని చెప్పేశారు. 


ఇప్పుడు అమరావతిలో జగన్ ప్రమాణ స్వీకారానికి అనువైన స్థలం ఎంపిక కొనసాగుతోంది. చిన్నవుటుపల్లి వద్ద ప్రమాణ స్వీకారవేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో మొదట ప్రమాణ స్వీకారం ఉంటుందని అనుకున్నారు. 

కానీ.. ట్రాఫిక్ రద్దీ వల్ల అక్కడ ఇబ్బంది అవుతుందని భావిస్తుతన్నారు. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 5 నుంచి 7  లక్షల మంది అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. అంతమంది వస్తే.. ఇందిరాగాంధీ స్టేడియం చాలదు. 

ప్రమాణ స్వీకార సభ ఏర్పాట్లకు భారీగానే స్థలం అవసరం..చిన్నావుటుపల్లి ఐతే హైవే కి దగ్గర ఉంటుందని.. అన్నిటికి అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు చిన్నఅవుటపల్లి వద్దే జగన్ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: