ఏపీలో చంద్రబాబు చిత్తుగా ఓడిపోవటం చాలా మందికి సంతోషాన్ని కలిగిస్తుంది. కొంత మంది నేతలైతే పండగ చేసుకుంటున్నారు. చంద్రబాబు దారుణ పరాజయాన్ని తాజాగా టీడీపీ మాజీ నేత - సీనియర్ పొలిటీషయన్ అయిన మోత్కుపల్లి పండుగ చేసుకుంటున్నారు. ఆయనపై దారుణ పదునైన విమర్శలు చేశారు.


తనకు గవర్నర్ - రాజ్యసభ సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారని.. అనంతరం మోసం చేసి వంద కోట్లకు ఒకటి చొప్పున అమ్ముకున్నారని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు ఏపీలో ఓడిపోయి అంతరించిపోయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఏపీలో జగన్ గెలుపు తనకు ఆనందాన్ని సంతోషాన్నిచ్చిందన్నారు. ఎన్టీఆర్ మనోవాంఛ ఇప్పుడు నెరవేరిందన్నారు.


ఇలా చంద్రబాబు ఓటమిపై తొలిసారి ఆ పార్టీ మాజీ నేత అయిన మోత్కుపల్లి హర్షించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇదివరకే మోహన్ బాబు - రాంగోపాల్ వర్మ వాళ్లు వ్యతిరేకించినా వాళ్లంతా వైసీపీ సానుభూతి పరులు..పార్టీ నేతలు.. కానీ బాబు చేతిలో మోసపోయిన ఇలాంటి టీడీపీ మాజీ నేతలు తొలిసారి బాబుకు సరైన శాస్తి జరిగిందని విమర్శించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: