ఏపీ ప్రజలు ఆ సుముహూర్తం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏళ్ళూ, వూళ్ళూ దాటుకుంటూ కాలాలను నెట్టుకుంటూ కష్టాలను తట్టుకుంటూ అభిమానులు ఆ రోజు కోసం ఆరాటంగా ఉన్నారు. జగన్ ఈ మూడు అక్షరాలు తారక  మంత్రాలు కాగా ఆ వేదిక పరవశించి పులకరించి పోవాలని కూడా ఆశిస్తున్నారు.


జగన్ అను నేను...ఇది ఇపుడు అభిమానుల చెవుల్లో మంగళకరమైన మంత్రంగా ఉంది. పదేళ్ళ పోరాటానికి అద్భుతమైన ఫలితం లభించింది. జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న వారి ఆశలు ఫలించే రోజు దగ్గరకు వచ్చేసింది. అయినా అది ఇంకా ఆలశ్యమేనని అభిమానులు భావిస్తున్నారు. క్షణమొక యుగంగా వారు ఫీల్ అవుతున్నారు.


ఎపుడెపుడు ఈ నెల 30వ తేదీ వస్తుందా అని ఆత్రపడుతున్నారు. ఆ రోజు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే అది రామరాజ్య స్థాపనకేనని గట్టిగా నమ్ముతున్నారు. టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు అన్నట్లు రాక్షస పాలన‌ అంతమైంది. రామ రాజ్యం వస్తోంది. ఆ శుభదినం తొందరగా రావాలని అభిమాన గణంతో పాటు, అశేష ఆంధ్ర జనం ఎదురుచూస్తున్నారు. జగన్ సీఎం అంటూ మారుమోగుతోందిపుడు ప్రతీ తెలుగు గుండె చప్పుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: